న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్ను పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు. మహ్మాద్ జుబేర్కు ప్రాణ హాని ఉందని, ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్సేల్వ్స్ సుప్రీంకోర్టుకు నివేదించారు.
జుబేర్ బెయిల్ పిటిషన్ను స్వీకరించి తక్షణమే విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్ధించారు. ఈ అంశాన్ని రిజిస్ట్రీలో లిస్ట్ అయిన మేరకు రేపు విచారిస్తామని సుప్రీం కోర్టు స్పస్టం చేసింది. హిందూ సన్యాసులను అవమానిస్తూ ట్వీట్ చేసిన కేసులో జుబేర్ను గత వారం అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను యూపీలోని సీతాపూర్ కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ కేసులో జుబేర్ను కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది.