ప్రయాగ్రాజ్, సెప్టెంబర్ 14: యూపీలోని మథుర జిల్లాలో దళిత కుటుంబాలపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై అలహాబాద్ కోర్టు సీరియస్ అయ్యింది. 35 మంది పోలీసు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
సుమిత్ కుమార్, అతడి సోదరుడు పునీత్కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన కోర్టు ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇతర కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకు పోలీసులు తమపై మోసపూరిత, తప్పుడు కేసులు బనాయించారని అన్నదమ్ములు సుమిత్కుమార్, పునీత్కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు.