Eknath Shinde : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. మెజారిటీకి మించిన స్థానాల్లో మహాయుతి ఆదిక్యంలో దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం మహాయుతి అభ్యర్థులు దాదాపు 220 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నారు. ప్రతిపక్ష మహా వికాస అఘాడీ కేవలం 60 స్థానాల్లో మాత్రమే ఆదిక్యత కనబరుస్తోంది.
దాంతో అధికార కూటమి గెలుపు దాదాపు ఖాయమైంది. సీఎం ఏక్నాథ్ షిండే కోప్రీ పచ్పఖడీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అటు మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ కూడా వారు పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు. అధికార కూటమికే మరోసారి మరాఠీలు పట్టం కట్టడంతో సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అధికార కూటమికే మళ్లీ పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సీఎం మీరే అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కూటమిలోని మూడు పార్టీల నేతలం కూర్చుని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈసారి పెద్ద పార్టీ అయిన బీజేపీ సీఎం పదవి చేపడుతుందా..? అని మీడియా ప్రశ్నించగా ‘కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూల్ ఏం లేదుగా..!’ అని షిండే వ్యాఖ్యానించారు.
#WATCH | Thane | Maharashtra CM & Shiv Sena leader Eknath Shinde says, “Let the final results come in…Then, in the same way as we fought elections together, all three parties will sit together and take a decision (on who will be the CM).” pic.twitter.com/q6hxe8Wyvn
— ANI (@ANI) November 23, 2024