న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం(ఈ నెల 19వ తేదీ) ఉదయం 9.30 గంటలకు లోక్సభ, రాజ్యసభ ఎంపీల గ్రూపు ఫొటో సెషన్ జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఆదివారం బులెటిన్ విడుదల చేసింది.
ఆ తర్వాత ఉభయ సభల కార్యకలాపాలు కొత్త పార్లమెంట్ భవనంలోకి మారనున్నాయి. నూతన పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ఎంపీలందరికీ కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.