ఐజ్వాల్: క్రైస్తవులు ఎక్కువగా ఉండే మిజోరంలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంఘాన్ని కోరాయి.
ఆదివారాలు క్రైస్తవులకు పవిత్రమైనవని.. ఆ రోజు ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతాయని ఈసీకి తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ తేదీని మార్చాలని ఈసీని కోరాయి.