న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రెజర్లు ఢిల్లీ నడి వీధుల్లో న్యాయం కోసం లడాయికి దిగిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. వీరి సమస్యను ఎక్కువగా ప్రచారం కానివ్వొద్దని బీజేపీయే గూడు పుఠాణి చేస్తున్నదనేది క్రీడాభిమానులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే రెజర్ల పోరాటం ఢిల్లీని దాటి రాష్ర్టాలను తాకింది.
ఆమ్ ఆద్మీ పార్టీ, ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ తదితర ప్రజా సంఘాలు మహిళా రెజర్లు చేస్తున్న పోరాటంలో పాలుపంచుకునేందుకు సిద్ధమయ్యాయి. రెజ్లర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు విశ్లేషకులు.