నాగపూర్, నవంబర్ 25: కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత ఫైల్పై సంతకం చేశానని, రాష్ట్ర స్థాయిల్లో అమలు కోసం ఈ పాలసీని రాష్ర్టాలకు పంపామని తెలిపారు. మహారాష్ట్రలోని నాగపూర్లో శుక్రవారం జరిగిన ‘అగ్రో విజన్’ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. పానిపట్లో ఇండియన్ ఆయిల్కి చెందిన రెండు ప్లాంట్లు దాదాపు ప్రారంభమయ్యాయని, వరిగడ్డిని ఉపయోగించి ఒకదానిలో రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని, మరోదానిలో రోజుకు 150 టన్నుల బయో-బిటుమెన్(తారు) తయారు చేస్తారని తెలిపారు.