లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అఖిలేష్ పేర్కొన్నారు. 1942లో ఈ రోజున ఆంగ్లేయుల తరిమేయాలని క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. సరిగ్గా అదే రోజున బీహార్ నుంచి బీజేపీని తరిమేయాలని నిర్ణయించారు. ఇది శుభారంభం అని అఖిలేష్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాజకీయా పార్టీలు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. నితీశ్ కుమార్ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకుడు.. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బీహార్ రాజకీయాలు, అక్కడి లెక్కలు ఆయనకు బాగా తెలుసు అని అఖిలేష్ పేర్కొన్నారు.