లక్నో : గంగా నది మురికికూపమని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్కు తెలుసుకునుకే ఆయన అందులో మునకేయలేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. గంగా నది ప్రక్షాళన కోసం కాషాయ పార్టీ రూ కోట్లు వెచ్చిస్తోందని..అయినా గంగా నది మురికి సంగతి తెలిసినందునే యోగి ఆదిత్యానాధ్ నదిలో పవిత్ర స్నానం ఆచరించలేదని అఖిలేష్ ఆరోపించారు. గంగా నదిని ఎప్పుడు ప్రక్షాళన చేస్తారని ఆయన నిలదీశారు.
గంగా నదిని శుభ్రం చేసేందుకు కోట్లు కుమ్మరిస్తున్నా నది ప్రక్షాళన పూర్తికావడం లేదని అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వారణాసిలో సోమవారం కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవం నేపధ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ విశ్వనాధ్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించిన క్రమంలో అఖిలేష్ స్పందిస్తూ ప్రజలు తమ ఆఖరి రోజుల్లో బెనారస్ను సందర్శిస్తారని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు.