Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైన నేపధ్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాను పాల్గొంటానని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం ప్రకటించారు. ఆగ్రాలో జరిగే ర్యాలీకి అఖిలేష్ యాదవ్ హాజరవుతారని భావిస్తున్నారు.
కాంగ్రెస్తో పొత్తు దిశగా తాము పలు దశల చర్చలు జరిపామని, పలు జాబితాలు పరిశీలించామని, ఇక సీట్ల సర్దుబాటు పూర్తవడంతో కాంగ్రెస్ యాత్రలో ఎస్పీ పాల్గొంటుందని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఇక రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండవ నెలలో ప్రవేశించింది. మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను సమన్వయపరుస్తూ రాహుల్ యాత్ర సాగుతోంది.
అయితే రాహుల్ యాత్ర సాగుతుండగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమని ప్రకటించడం, బిహార్ సీఎం నితీష్ కుaమార్ ఇండియా కూటమి నుంచి బయటపడి ఎన్డీయేకు చేరువవడం విపక్ష కూటమిలో కలకలం రేపింది. ఇక రాహుల్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లో ప్రవేశించినా తనకు మర్యాదపూర్వకంగా తెలియచేయలేదని, తాను ఇండియా కూటమిలో ఉన్నా ఆహ్వానించలేదని దీదీ భగ్గుమన్నారు.
Read More :