Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. గౌతంబుద్ధనగర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ మాట్లాడుతూ అగ్నివీర్ స్కీమ్పై యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ను రద్దుచేస్తామని పేర్కొన్నారు.
ఇక అంతకుముందు యూపీలోని అమ్రోహ్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లను ఉద్దేశించి గతంలో ఇద్దరు యువరాజులు నటించిన సినిమాను యూపీ ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ యూపీలో ప్రజలను వీరు బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల మాటున ఓట్లు అడిగేందుకు వస్తారని విమర్శించారు. ప్రచారంలో వీరు మన మతవిశ్వాసాలను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి భారత్ మాతాకీ జై అనేందుకు కూడా ఇబ్బంది పడతారని అన్నారు.
Read More :
Raj Kundra | కోట్లు విలువైన ఆస్తులు అటాచ్.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన రాజ్ కుంద్రా