లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ స్పందించారు. గతంలో కంటే తమకు రెండున్నర రెట్లు సీట్లను అందించనందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి రానున్న రోజుల్లో మరింతగా సీట్లు తగ్గుతాయని పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో మాకు రెండున్నర రెట్లు సీట్లు, ఒకటిన్నర రెట్లు ఓట్లు అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. బీజేపీ ఓట్లు తగ్గుతాయని మేం నిరూపించాం. రానున్న రోజుల్లో ఆ పార్టీ సీట్లు మరింతగా తగ్గుతాయి. ఆ పార్టీకి ఉన్న భ్రమలు సగానికిపైగా తొలగిపోయాయి. రానున్న రోజుల్లో పూర్తిగా పోతాయి. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని అఖిలేశ్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలిపారు. కాగా ఎన్నికల్లో ఎస్పీ కూటమికి 125 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.