Akhilesh Yadav : బిహార్ రాజకీయ పరిణామాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేకు చేరువవుతున్నారనే వార్తలపై అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమి వైపు గట్టిగా నిలబడితే ఆయన ప్రధాని అయ్యే వారని అన్నారు. కూటమిలో ఎవరినైనా ప్రధాని పదవికి పరిశీలించవచ్చు..నితీష్ కుమార్ గట్టి మద్దతుతో ప్రధాని పదవికి పోటీదారు అయ్యేవారని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
జనవరి 28న నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. నితీష్ కుమార్ యూటర్న్ పట్ల నిరుత్సాహం వ్యక్తం చేసిన అఖిలేష్ తానిప్పటికీ జేడీయూ చీఫ్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. నితీష్ కుమార్ చొరవ తీసుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేశారని ఈ వ్యవహారంలో గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని అఖిలేష్ కోరారు.
ఇక రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశంపై అఖిలేష్ స్పందిస్తూ సమయంపై ఈ విషయం వెల్లడిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం విషయంలో ఈ వ్యవహారాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, దీని నుంచి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సరైన సమయంలో తాను అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తానని ఎస్పీ చీఫ్ వెల్లడించారు.
Read More :
గుడిని కూల్చి మసీదు కట్టారు… జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. తేల్చిన పురావస్తు శాఖ