న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల (ఎస్పీ) మధ్య వివాదంతో ఇండియా కూటమి నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. విపక్ష ఇండియా కూటమి లుకలుకలపై భాగస్వామ్య పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఈ పరిణామాలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మట్టికరిపించేందుకు ఇండియా కూటమి కంటే ఓబీసీలు, దళితులు, మైనారిటీలను అంటే పీచ్డే, దళితులు, అల్పసంఖ్యాకులు (పీడీఏ) ఆకట్టుకోవడం కీలకమని వ్యాఖ్యానించారు. తాను గతంలోనూ ఇదే విషయం చెప్పానని తొలుత పీడీఏ ఏర్పాటవగా ఆపై ఇండియా కూటమి ఏర్పాటైందని గుర్తుచేశారు.
ఇండియా కూటమి కొనసాగినా పీడీఏనే తమ వ్యూహంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేను మట్టికరిపించేందుకు 28 పార్టీలతో విపక్ష ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక పంజాబ్లో ఆప్, కాంగ్రెస్, మధ్యప్రదేశ్, యూపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ మధ్య విభేదాలు బహిర్గతం కావడం ఇండియా కూటమి నిర్వీర్యమవుతుందనే సంకేతాలు పంపుతోంది.
Read More :