Loksabha Elections 2024 : విపక్ష నేతలు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బీహార్లో చేసిన ముజ్రా (Mujra) డాన్స్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలను విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రధాని స్ధాయి వ్యక్తి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని తీరు బిహారీలను అవమానించడమేనని మండిపడ్డాయి.
ఆత్మ విశ్వాసం చెదిరినప్పుడు మాటలు కూడా తడబడుతుంటాయి..మోదీలో విశ్వాసం సన్నగిల్లిన ఫలితంగానే ఆయన ఇలాంటి భాష వాడుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీలోని బలియాలో అఖిలేష్ విలేకరులతో మాట్లాడారు. ఈసారి ప్రజలు తమను ఇంటికి సాగనంపుతున్నారని బీజేపీ నేతలకు తెలిసిపోయిందని అన్నారు.
ఏడో దశలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్పై ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నదని చెప్పారు. బీజేపీ అన్నీ మోసపూరిత హామీలను ఇస్తోందని ప్రజలు గ్రహించారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి గెలుపు ఖాయమని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.
Read More :
Cyclone Remal | తీవ్ర తుపానుగా మారిన రెమాల్.. ఏపీలో భారీ వర్షాలు!