కోల్కతా: బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు. శుక్రవారం కోల్కతాలోని మమత నివాసంలో అఖిలేశ్ యాదవ్, ఇతర ఎస్పీ నేతలు ఆమెతో సమావేశమయ్యారు.
అనంతరం నందా మీడియాతో మాట్లాడారు. బీజేపీపై ఉమ్మడి పోరు సాగించాలని, అదే సమయంలో కాంగ్రెస్కు దూరంగా ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు చెప్పారు. త్వరలో బిజూ జనతాదళ్ అధినేతతో మమత, అఖిలేశ్ భేటీ కానున్నారు.