Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడి ఓటమి కోరుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు. తన కుమారుడిపై దక్షిణ కేరళ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఆంటో ఆంటోనీ విజయం సాధిస్తారని ఆంటోనీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల వారసులు బీజేపీలో చేరడం తప్పిదమని, కాంగ్రెస్ తన మతం, అభిమతమని ఆంటోనీ స్పష్టం చేశారు. తిరువనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్పై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేరళ ప్రజలు సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంటారని తాను అనుకోవడం లేదని ఆంటోనీ పేర్కొన్నారు.
జాతీయ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఓ స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదని కేరళ సీఎం చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. విపక్ష ఇండియా కూటమి రోజురోజుకూ బలపడుతుండగా బీజేపీ బలహీనపడుతున్నదని, రానున్న లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరే అవకాశాలున్నాయని చెప్పారు.
Read More :
Pandit Keshav Dev | మెడలో చెప్పులదండతో లోక్సభ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఎందుకంటే..!!