Pandit Keshav Dev : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వివిధ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు ఆసక్తి రేపుతుంటాయి. తమకు కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ప్రచారంలో వాడుకునే తీరు మరింత ఇంటరెస్టింగ్గా ఉంటుంది. 2024 లోక్సభ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ ఎన్నికల్లో కూడా ఓ అభ్యర్థి తనకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోక్సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం పాదరక్షల గుర్తును కేటాయించింది. దాంతో ఆయన ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లకు తన గుర్తు బాగా గుర్తుండిపోవాలనే తాను ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని పండిట్ కేశవ్ దేవ్ చెబుతున్నారు.
కాగా, 2024 లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. అలీగఢ్ నియోజకవర్గానికి రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడిచనున్నారు. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్నాయి. దాంతో యూపీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు విడతల్లో కొనసాగనుంది.