న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 30 ఏళ్ల వయసున్న అతడు గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 30 ఏళ్ల హిమ్మనీల్ కుమార్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కింద పడిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. వెంటనే ఎయిర్పోర్ట్లోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ పైలట్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆ అధికారి వెల్లడించారు.