జైపూర్ : ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India flight ) టేకాఫ్ తీసుకోగానే ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
సమస్యను పసిగట్టి చక్కదిద్దిన అనంతరం గంట సమయంలో విమానం ఉదయ్పూర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇక జూన్ 21న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
సాంకేతిక సమస్య తలెత్తడంతో వార్నింగ్ సిగ్నల్ అందిన కారణంగా ప్రయారిటీ ల్యాండింగ్ తీసుకున్నట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ప్రయారిటీ ల్యాండింగ్కు అనుమతించాలని పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడని పేర్కొన్నాయి.
Read More :
Karnataka | బంధువుతో ప్రేమాయణం.. ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు