న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి పాక్ నిషేధిత గగనతలంలోకి దారితప్పి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ అధికారులు హెచ్చరించడంతో తప్పు తెలుసుకుని తిరిగి భారత గగనతలంలోకి చేరుకుంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తిరిగి భారత్ గగనతలంలోకి వచ్చిన తర్వాత ఈ విమానం ల్యాండింగ్కు అమృత్సర్లో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వెనక్కి వచ్చేసి ఢిల్లీకి చేరుకుంది.