Air India | న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.
దీనిని తీవ్రంగా పరిగణించి ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.