న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నాయడని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చగీస్ వాసులు, కెనడా దేశస్థుడు ఒకరు చొప్పున ఉన్నారని తెలిపింది. గాయపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడని, అతడు చికిత్స పొందుతున్నాడని తెలిపింది. అయితే విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.
కాగా, విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎయిర్ఇండియా ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని వెల్లడించింది. అదనపు సహాయం అందించడానికి సంస్థ నుంచి అహ్మదాబాద్కు సిబ్బందిని పంపామని, ప్రమాద ధటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. ఇప్పటికే హాట్లైన్ నంబర్ (1800 5691 444)ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్లైన్ నంబర్కు ఫోన్లు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది.
UPDATE: Air India confirms that flight AI171, operating from Ahmedabad to London Gatwick on 12 June 2025, was involved in an accident.
The 12-year-old Boeing 787-8 aircraft departed from Ahmedabad at 1338 hrs, carrying 230 passengers and 12 crew.
The aircraft crashed shortly…
— Air India (@airindia) June 12, 2025