న్యూఢిల్లీ, మార్చి 15: ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) లాంటి సంస్థల సంఖ్యను తమ ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కర్ణాటక పర్యటనలో ఘనంగా సెలవిచ్చారు. మోదీ హయాంలో ఎయిమ్స్ లాంటి సంస్థల సంఖ్య 7 నుంచి 22కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ట్వీట్ చేశారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిశీలిస్తే కొన్ని చోట్ల ఈ సంస్థలు పునాది రాళ్లకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా రోగులకు పరిమితంగానే సేవలు అందిస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రకటనలన్నీ డొల్లేనని తేటతెల్లమైంది.
ఎయిమ్స్, బీబీ నగర్ (తెలంగాణ)
బిలాస్ పూర్(హిమాచల్ ప్రదేశ్); డియోఘర్(జార్ఖండ్); రాజ్కోట్(గుజరాత్), నాగ్పూర్(మహారాష్ట్ర), గోరఖ్పూర్(యూపీ), మంగళగిరి(ఏపీ), కళ్యాణి(పశ్చిమ బెంగాల్), భటిండా(పంజాబ్)లలో ఉన్న ఎయిమ్స్లలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల మాత్రం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఎయిమ్స్, అవంతిపొర (జమ్ము కశ్మీర్)
ఎయిమ్స్, గౌహతి(అస్సాం)
ఎయిమ్స్, రెవారి(హర్యానా)
ఎయిమ్స్, దర్భంగా(బీహార్)