గువాహటి: అసోంలో నిర్మాణంలో ఉన్న ఓ హాస్పిటల్ భవనంపైనుంచి కింద పడి వైద్యుడు మృతిచెందారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఫాల్గు ప్రతిమ్ దాస్ అనే వైద్యుడు దవాఖాన ఏడో అంతస్తు నుంచి కింద పడ్డాడు. అక్కడే నిర్మాణపనులు చేస్తున్న కార్మికులు పెద్ద శబ్ధం వినిపించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రక్తం మడుగులో పడిఉన్న ఆ డాక్టర్ను సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమిండచంతో మరణించాడని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్ భవనంపై నుంచి కింద పడిన ఘటన ప్రమాదమా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దవాఖాన నిర్మాణం పూర్తికానప్పటికీ.. అక్కడ వైద్యవిద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారు.