న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్ను నియమించే వరకు ఆయనే ఎయిమ్స్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల కాలానికి రణదీప్ గులేరియా 28 మార్చి 2017న ఎయిమ్స్ డైరెక్టర్గా నియామకమయ్యారు. గురువారం నుంచి మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించగా.. ఈ లోపు కొత్త డైరెక్టర్ను నియమించనున్నారు.