చెన్నై : అన్నాడీఎంకే పార్టీలో కీలకమైన రెండు పదవులకు ఎన్నికలు సోమవారం పూర్తయ్యాయి. పార్టీ కన్వీనర్గా పన్నీర్ సెల్వం, జాయింట్ కన్వీనర్గా పళనిస్వామి ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీ పొన్నయన్ ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఇద్దరూ తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో 2017లో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు పదవులకు ఎంపికయ్యారు.
ఎన్నికల అనంతరం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. రెండు పదవులకు పన్నీర్ సెల్వం, పళనిస్వామి నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చాయని అన్నాడీఎంకే సంస్థాగత కార్యదర్శి పొన్నయన్ తెలిపారు. కన్వీనర్, జాయింట్ కన్వీనర్లుగా ఎన్నికైన అనంతరం ఇద్దరు నేతలు పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, దివంగత అధినేత జయలలిత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.