AI Teacher | తిరువనంతపురం: అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ‘ఏఐ’ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞానం.. విద్యారంగంలోనూ అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి జెనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఓ స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువనంతపురం కేటీసీటీ ఉన్నత పాఠశాలలో హ్యూమనాయిడ్ ఏఐ టీచర్ ‘ఐరిస్’ను ఆవిష్కరించారు. రోబోటిక్స్, జెనరేటివ్ టెక్నాలజీని ఉపయోగించి ‘మేకర్ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. సాంప్రదాయ టీచింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులను ఇది తీసుకొస్తుందని సంస్థ తెలిపింది.
విద్యార్థులతో ‘ఐరిస్’ మూడు భాషల్లో మాట్లాడుతుందని, సంక్లిష్టమైన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పగలదని పేర్కొన్నది. ఇంటెల్ ప్రాసెసర్ కలిగిన ‘ఐరిస్’లో వాయిస్ అసిస్టెంట్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్, మొబిలిటీ.. మొదలైన ఆప్షన్లు ఉన్నట్టు సంస్థ తెలిపింది.