అహ్మద్ పటేల్.. కాంగ్రెస్ దివంగత నేత. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆంతరంగికుడు. సోనియాకి రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉంటూ.. వెనకుండి పార్టీని నడిపించారు. ఒక్క లైన్లో చెప్పాలంటే పార్టీకి సంకట్ మోచన్గా పేరు గడించారు. అయితే ఆయన మరణించారు. ఆయన వారసుడు ఫైసల్ పటేల్ కచ్చింగా కాంగ్రెస్కే సేవలందిస్తారని అందరూ భావించారు. అయితే.. తాను కాంగ్రెస్లో చేరుతానని ఫసల్ ఎక్కడా, ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అయినా.. పార్టీ హైకమాండ్ తనతో సంప్రదింపులు జరుపుతుందేమోనన్న ఆశలో మాత్రం ఉన్నారు.
ఓ వైపు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతుండగానే ఫసల్ పటేల్ సంచలన ట్వీట్ చేశారు. ‘చాలా రోజులుగా అధిష్ఠానం మాట కోసం ఎదురుచూస్తున్నా. ఉలుకూ లేదు. పలుకూ లేదు. అలసిపోయా. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ప్రోత్సాహం కూడా కరువైంది. అన్నీ ఆప్షన్లూ నేను తెరిచే పెట్టుకున్నాను’ అంటూ ఫసల్ పటేల్ ట్వీట్ చేశారు. అయితే.. ఇప్పటి వరకూ పార్టీ దీనిపై స్పందించలేదు.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022