వరంగల్ అర్బన్ : పోలీసులంటే క్రౌర్యమే కాదు. ఆర్థ్రతతో కూడిన హృదయాలను కలిగి ఉంటారని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. లాఠీలు పట్టిన చేతులతోనే ప్రేమ హస్తాలను చాచి ఆపత్కాలంలో అండగా ఉంటారు. అలాంటి ఓ మానవీయ సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..శాయంపేట రూరల్ సీఐ రమేశ్ బాబు సీఎం బందోబస్త్లో భాగంగా ఎంజీఎం హాస్పిటల్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో అవస్థపడుతూ ఎటూ కదలలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నది. గమనించిన సీఐ కరోనా అని కూడా లెక్క చేయకుండా మానవీయంగా స్పందించాడు.
ఆ వృద్ధురాలిని తన చేతులతో ఎత్తుకొని ఆటో ఉన్న స్థలానికి ఎత్తుకొని పోయి చికిత్స నిమిత్తం హాస్పిటల్కు పంపించాడు. సీఐ సహృదతయను చూసి పరకాల ఏసీపీ శ్రీనివాస్ అభినందించగా పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం
ప్రైవేట్ హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో సేవలందించాలి