మహబూబ్నగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ మానవతా దృక్పథంతో సేవలందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..20 శాతం బెడ్లను పేద కరోనా బాధితులకు ఉచితంగా.. లేదంటే నామమాత్రపు ఫీజుతో వైద్యం అందించాలన్నారు. సిటీ స్కానింగ్ రూ.1999 కే చేయాలని సూచించారు.
రెండు, మూడు దవాఖానల్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాంటి పనులు మానుకోవాలి. లేదంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంత్రి సూచన మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అందరూ కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వైద్య పరీక్షల రేట్లను ప్రకటించారు.
ప్రభుత్వానికి కేటాయించే 20 శాతం బెడ్లలో వసూలు చేసే చార్జీలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాథమిక రక్త పరీక్షలు, మందులు కలిపి ఆరు రోజుల వైద్యం కోసం ఆక్సిజన్ లేకుండా వైద్య సదుపాయాలు కల్పించినందుకు గాను రూ.30,000 వేలుగా నిర్ణయించారు. అలాగే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60,000 చెల్లించాలని వివరాలను వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం