లక్నో, ఫిబ్రవరి 14: లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
బుధవారం లక్నోలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన కుటుంబం పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ లబ్ధిపొందిందని బ్రజేశ్ చెప్పారు.