భోపాల్, సెప్టెంబర్ 25: పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓబీసీలకు ప్రత్యేక కోటా.. ప్రస్తావన లేకుండా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారని కొద్ది రోజుల క్రితం మోదీ సర్కార్పై తన అసంతృప్తి వెళ్లగక్కారు. మరికొద్ది నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.