Ram Mandir | బెంగళూరు : అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని అడ్డుకున్నారు. ఇక్కడ్నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొంది దళితులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
మీరు మాకేం చేయలేదు. మేమే అన్ని చేసుకున్నాం. రాముడిని కూడా మేం గౌరవిస్తాం, పూజిస్తాం అని ఓ దళితుడు పేర్కొన్నాడు. అయోధ్యలోని రామమందిరంలో కొలువైన శ్రీరాముడి విగ్రహానికి తమ గ్రామం నుంచే శిలను ఇచ్చామని తెలిపాడు. అలాంటి తమ గ్రామానికి, దళితులకు మీరేం చేయలేదని ఎంపీ ప్రతాప్ సింహాపై ధ్వజమెత్తారు.
ఈ ఉద్రిక్త పరిస్థితులను గమనించిన పోలీసులు.. దళితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఎంపీ ప్రతాప్ సింహాకు ప్రత్యేక భద్రత కల్పించి, అక్కడ్నుంచి పంపించేశారు. ఎంపీ కూడా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.
In a major embarrassment to #BJP MP Pratap Simha, villagers stopped him from participating in the #Pooja in #Karnataka’s Mysuru, claiming he is anti dalit and that he never visited this village before. This is where the rock was sourced for the statue of #LordRam. pic.twitter.com/sRok8v9Gdf
— Pratiba Raman (@PratibaRaman) January 22, 2024