న్యూఢిల్లీ: సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్ట్నెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని వెల్లడించారు.
యువతకు టెక్నాలజీపై మంచి అవగాహన ఉన్నదని, ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షతో ఎవరికీ ఇబ్బంది ఉండదనే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. సైన్యంలో అగ్నివీరులు, ఇతర నియామకాలకు సంబంధించి నూతన మార్పులపై సైన్యం ఈ నెల 16న ప్రకటనలు జారీచేసింది. తమ అర్హతలను అనుసరించి అభ్యర్థులు ఈ నెల 16 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు సీఈఈ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.