లక్నో: అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఘటనలో 250 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం నాటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ దీనిపై ప్రకటన చేశారు. ఫిరోజాబాద్, అలీఘడ్, వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అరెస్టు అయిన 260 మందిలో 109 మంది బాలియాకు చెందిన వారున్నారు. 70 మంది మథుర, 31 మంది అలీఘడ్, 27 మంది వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ నుంచి 15 మంది ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం రోజున బాలియా రైల్వే స్టేషన్లో యువత ఓ రైలుకు నిప్పుపెట్టారు.