గౌతంనగర్, జూలై 9 : పార్టీలకు అతీతంగా పనిచేసి అభివృద్ధిని సాధించుకుందామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెల్లడించారు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జుననగర్లో రూ.50 లక్షల నిధులతో ఆర్సీసీ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీతతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దశరథ, ఈఈ లక్ష్మణ్, ఏడీ వినోద్కుమార్, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, సర్కిల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీఎన్వీ.సతీశ్కుమార్, మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.