జైపూర్: రైలు పట్టాలపై రాళ్లు, ట్రాక్ జాయింట్ల వద్ద ఇనుప రాడ్లు ఉన్నాయి. గమనించిన లోకో పైలట్లు వందే భారత్ రైలును (Vande Bharat train) అత్యవసరంగా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజస్థాన్లోని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 7.50 గంటలకు ఉదయ్పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఉదయ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరింది.
కాగా, ఉదయం 9.55 గంటల సమయంలో గంగారార్-సోనియానా సెక్షన్లోని రైల్వే ట్రాక్పై వరుసగా రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి వందే భారత్ రైలును నిలిపివేశారు. కిందకు దిగి రైలు పట్టాలపై ఉన్న రాళ్లును గమనించి వాటిని తొలగించారు. రైల్వే ట్రాక్ జాయింట్ వద్ద రాళ్లతోపాటు రాడ్లు ఉండటం చూసి షాక్ అయ్యారు.
మరోవైపు రైలు పట్టాలపై ఉన్న రాళ్లు, ఇనుప రాడ్ల ఫొటోలు తీసిన తర్వాత లోకో పైలట్లు వాటిని తొలగించారు. దీని గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్పై వరుసగా రాళ్లు, అడుగు పొడవున్న ఇనుప రాడ్లు అమర్చడంపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
⚡️⚡️Alert Staff prevented a major disaster, a possible terror-act to derail #VandeBharat train in Rajasthan.
Video- Strategically planned rocks etc on railway tracks to derail Udaipur – Jaipur Vande Bharat Express near Bhilwara in Rajasthan.pic.twitter.com/54tfQQt4QP
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 2, 2023