న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్కు రూ 100 దాటి పరుగులు పెడుతుండటం, వంట గ్యాస్ ధరలు మంటెత్తడంతో నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ధరల అనూహ్య పెరుగుదల సాధ్యమేనని చిదంబరం ఎద్దేవా చేశారు.
2020లో రూ 594గా ఉన్న వంటగ్యాస్ ధర ఈ ఏడాది జులై 1కి రూ 834కి ఎగబాకిందని అన్నారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు తాజాగా సిలిండర్పై రూ 25 చొప్పున పెంచాయి. ఇక పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు గత రెండు నెలల్లో లీటర్కు రూ 8.41 భారమవగా, డీజిల్ ధరలు లీటర్కు రూ 8.45 పెరిగి వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి.