న్యూఢిల్లీ, మార్చి 27: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గోవా ఆప్ కన్వీనర్ అమిత్ పాలేకర్, పలువురు పార్టీ నేతలకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నెల 28(గురువారం) పనాజీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో కోరినట్టు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.
2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ పాలేకర్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ గోవా ఎన్నికల ప్రచారం కోసం అక్రమ సొమ్ము పంపించారనే ఆరోపణలకు ఏ ఆధారాలు లేవని, ఎలాంటి దర్యాప్తుకైనా తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.