Atishi | జూన్ 4న ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారం చేపడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి (Delhi Minister) అతిశీ (Atishi) అన్నారు. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ (electoral bonds scam) కుంభకోణంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కేసులో బీజేపీ నాయకులు జైలుకు వెళతారని (BJP leaders will go to jail ) అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం కటకటాలపాలవుతారని పేర్కొన్నారు.
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన అతిశీ.. ‘దేశ ప్రజలు తమ ఓట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన ఎలక్టోరల్ బాండ్ల స్కామ్పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బీజేపీ నాయకులు జైలుకు వెళ్లబోతున్నారు. బీజేపీ నేతలేకాదు.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కూడా జైలుకు వెళ్లనున్నారు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం కూడా ఉంది’ అని అతిశీ అన్నారు.
Also Read..
Manisha Koirala | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ని కలిసిన మనీషా కోయిరాల.. ఫొటోలు షేర్ చేసిన నటి
Deepfake | డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో రిలీజ్ చేసిన కేంద్రం
Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్లో అనంత్ వివాహం