న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ ఇటీవల ఆ పార్టీని పదే పదే విమర్శించడంతోపాటు ప్రధాని మోదీని తెగ పొగిడేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ దీనిపై సోమవారం స్పందించారు. గులాం నబీ ఆజాద్ మరీ ఇంతగా ఎందుకు దిగజారారో? అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆజాద్కు కౌంటర్కు ఇచ్చారు.
కాంగ్రెస్లో సుదీర్ఘ కెరీర్ తర్వాత, పూర్తిగా మర్యాద, విచక్షణ లేకుండా పార్టీకి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చే బాధ్యతను ఆజాద్కు అప్పగించినట్లుగా తెలుస్తున్నదని జైరాం రమేష్ ఆరోపించారు. ఆజాద్ తనను తాను మరింతగా తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ‘ఆజాద్ ఎందుకో భయపడుతున్నారు. ప్రతి నిమిషం తన ద్రోహాన్ని సమర్థించుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. విషయాన్ని సులభంగా బహిర్గతం చేసే ఆయన ఈ స్థాయికి ఎందుకు దిగజారారు? అని ట్వీట్లో ప్రశ్నించారు.
మరోవైపు జైరాం రమేష్ హిందీ ట్వీట్ను కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విటర్ హ్యాండిల్లో ఇంగ్లీష్లో పోస్ట్ చేసింది.
आज़ाद वर्षों तक जिस पार्टी में रहे। जहां उन्हें सब कुछ मिला। उन्हें उसी पार्टी को बदनाम करने का काम सौंपा गया है। यह उनके स्तर को और गिरा रहा है।
आखिर क्यों हर मिनट वह अपने विश्वासघात को सही ठहरा रहे हैं? उन्हें आसानी से बेनकाब किया जा सकता है, लेकिन हम अपना स्तर क्यों गिराएं ?
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 29, 2022
After such a long career, courtesy entirely the party he’s been tasked to slander, by giving interviews indiscriminately, Mr. Azad diminishes himself further. pic.twitter.com/JG234ImLmP
— Indian Youth Congress (@IYC) August 29, 2022