Lalu Prasad Yadav : ఈ లోక్సభ ఎన్నికల్లో అంతటా ఇండియా కూటమే విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికలతో ‘ప్రధాని నరేంద్రమోదీ ఖతం’ అని ఆయన వ్యాఖ్యానించారు. పట్నాలో పార్టీ కార్యాలయానికి వచ్చిన లాలూ యాదవ్ను మీడియా పలుకరించడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఈసారి మళ్లీమళ్లీ బీహార్ చుట్టూ తిరుగుతున్నారని, బీహార్ ఎక్కువ సీట్లు రావనే సందేహంతోనే ఆయన నష్టాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని లాలూ చెప్పారు. మోదీ పని ఖతం అవుతుందనడానికి ఇదే నిదర్శమని అన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసి ఈ ఎన్నికలతో ఆయన ఫినిష్ అని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.