న్యూఢిల్లీ : రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికాయత్ తన ఊరికి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలోని సిసౌలి టికాయత్ సొంతూరు.
ఈ గ్రామానికి ఢిల్లీ నుంచి మోదీనగర్, మీరట్, దౌరలా టోల్ ప్లాజా, మన్సూర్ పూర్ మీదుగా చేరుకోనున్నారు. ఈ దారిలో టికాయత్కు స్వాగతం పలికేందుకు రైతులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో రైతులు తమ ఉద్యమాన్ని విరమించుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోని టిక్రీ, సింఘూ, ఘాజీపూర్ బోర్డర్ ల వద్ద తమ టెంట్లను రైతులు తొలగించిన సంగతి తెలిసిందే.