శ్రీహరికోట: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1(Aditya L1) స్పేస్క్రాఫ్ట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నది. విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ57 నుంచి ఆదిత్య వేరుపడింది. దీంతో మిషన్ సక్సెస్ అయినట్లు ఇవాళ ఇస్రో ప్రకటించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ దిశగా ఆదిత్య స్పేస్క్రాఫ్ట్ తన జర్నీ మొదలుపెట్టినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. సుమారు 1.04 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి వేరుపడిన ఆదిత్య ఎల్1 కక్ష్యలోకి చేరింది. ఉదయం 11.50 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ప్రవేశించినట్లు ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పేర్కొన్నది. ఎల్1 పాయింట్ దిశగా ఆదిత్యుడి సౌరయానం మొదలైనట్లు వెల్లడించింది.
PSLV-C57/Aditya-L1 Mission:
The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully.
The vehicle has placed the satellite precisely into its intended orbit.
India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point.
— ISRO (@isro) September 2, 2023