న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కోసం పెట్టుబడులు పెట్టాలని ట్విట్టర్ ద్వారా ఆయన సలహా ఇచ్చారు. అయితే, ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చిన నేపథ్యంలో సీరమ్ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
‘హే ఎలాన్ మస్క్. ఒకవేళ ట్విట్టర్ కొనుగోలు ఇంకా పూర్తికాకపోయి ఉంటే.. అధిక నాణ్యతతో భారీ స్థాయిలో భారత్లో టెస్లా కార్ల తయారీకి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటే చూడండి. ఇది మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి ఇదే అవుతుంది. నేను హామీ ఇస్తున్నాను’ అంటూ అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. గత నెలలో ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ 44 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారత్లో ఎలాన్ మస్క్ టెస్లా కారు భారత మార్కెట్లోకి ఇంకా విడుదల కాలేదు. వాస్తవానికి భారత్లో కార్ల తయారీకి ఎప్పుడో టెస్లా ముందుకు వచ్చింది. అయితే, ముందుగా దిగుమతి చేసిన కార్లు విజయవంతం అయితేనే తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. టెస్లా కార్లు ప్రస్తుతం ఎక్కువగా అమెరికా, చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, కార్లను భారత్లోకి దిగుమతి చేసుకోవడం ద్వారా సుంకాల ప్రభావంతో ధరలు పెరగనున్నాయి.
ఈ పరిస్థితుల్లో చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవడం కంటే భారత్లోనే టెస్లా ప్లాంట్ను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని ఎలాన్ మస్క్కు కేంద్ర ప్రభుత్వం ప్రాతిపాదించింది. గత ఏడాది టెస్లా మోటార్స్ కర్నాటకలో తయారీ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఆసక్తిని కనబరిచినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు తమ రాష్ట్రంలో టెస్లా ఉత్పత్తిని ప్రారంభించాలని ఎలాన్ మస్క్ను ఆహ్వానించాయి.
Hey @elonmusk just in case you don’t end up buying @Twitter, do look at investing some of that capital in INDIA for high-quality large-scale manufacturing of @Tesla cars. I assure you this will be the best investment you’ll ever make.
— Adar Poonawalla (@adarpoonawalla) May 8, 2022