న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్కు నిర్ధిష్ట వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. గురువారం ఓ కార్యాక్రమంలో పాల్గొన్న ఆయన.. విలేకరులతో మాట్లాడారు. ఒరిజినల్ నోవోవాక్స్ కొవిడ్ టీకా ఒమిక్రాన్ను సైతం అడ్డుకుంటుందని, ఇందుకు సంబంధించిన కీలక డేటా ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో తాము ఒమిక్రాన్కు నిర్ధిష్ట వ్యాక్సిన్ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్.. ఒమిక్రాన్కు వ్యాక్సిన్ను తెచ్చేందుకు అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవావాక్స్తో కలిసి పని చేస్తుంది. కొవిడ్-19 నుంచి కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందడంతో ఒమిక్రాన్ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్ కొవిడ్ టీకా భారత్లో 12 సంవత్సరాలు పైబడిన వారందరికీ అందుబాటులో ఉన్నది. మంకీపాక్స్పై స్పందిస్తూ.. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అవసరం ‘చర్చించదగినది’ అని అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఈ అంశంపై సైతం పరిశోధన చేస్తున్నామని, బయోటెక్నాలజీ విభాగం సహకారంతో పరిశోధన జరుగుతుందన్నారు.