జమ్ము: అలనాటి అందాల నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మతోండ్కర్ (48) ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు.
ఊర్మిళ క్రీమ్ కలర్లో ఉన్న కశ్మీరి ఫెరాన్ ధరించడంతోపాటు తలకు బీనీ క్యాప్ పెట్టుకుని యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కశ్మీరి ఫెరాన్ వదులుగా ఉండే కశ్మీరీల సంప్రదాయ వస్త్రం. ఊర్మిళ మతోండ్కర్తోపాటు ప్రముఖ రచయిత పెరుమాల్ మురుగన్, జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికార్ రసూల్ వాని, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రా కూడా రాహుల్గాంధీతోపాటు యాత్రలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర గత సెప్టెంబర్ 7న తమిళానాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల మీదుగా ఈ నెల 23న జమ్ము సిటీకి చేరుకుంది. ఈ నెల 30న కశ్మీర్లో యాత్ర ముగియనుంది. అదేరోజు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించనుంది.