న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 8,774 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరాయి. ఇందులో 3,39,98,278 మంది కరోనా నుంచి కోలుకోగా 1,05,691 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,68,554 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, దేశంలో యాక్టివ్ కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో మరో 9,481 మంది కరోనా నుంచి కోలుకోగా, 543 మంది మృతిచెందారని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయి. రాష్ట్రంలో శనివారం 4,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది.