న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న వానకాలంలో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనా వేసి ంది. వచ్చే జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 96 శాతం నుంచి 104 శాతం వరకు ఉండొచ్చని వెల్లడించింది. గడిచిన మూడేండ్లలో కూడా వానకాలం సీజన్లో సాధారణ వర్షాలే పడ్డట్టు గుర్తుచేసింది. మధ్య పసిఫిక్ సముద్ర తీరంలో ఏర్పడే లానినా పరిస్థితులు వానకాలంలో అనుకూలంగానే ఉండనున్నట్టు వివరించింది.